Cricket: కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీని గెలుచుకున్న జట్టు?

ట్రోఫీని అందుకుంటున్న ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ తమోరే

బీసీసీఐ దేశవాళీ అండర్‌–25 టోర్నీ (కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ)ను ముంబై జట్టు సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా ముగిసిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై 75 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేయగా విదర్భ 385 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన విదర్భ 121 పరుగులకే ఆలౌటైంది.

GK Awards Quiz: 94వ ఆస్కార్ అవార్డ్స్ 2022లో "ప్రధాన పాత్రలో ఉత్తమ నటి" అవార్డును గెలుచుకున్న‌ది?

యూఏఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ ఒప్పందం
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని రువాయిస్‌ కెమికల్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అబుధాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ (త’జీజ్‌) ఏప్రిల్‌ 26న వాటాదారుల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుపై 2 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్‌ తదితర రసాయనాలను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించాయి.

Asian Games 2022: ఆసియా క్రీడలను తొలిసారి ఎక్కడ నిర్వహించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బీసీసీఐ దేశవాళీ అండర్‌–25 టోర్నీ (కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ) విజేత?
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు    : ముంబై జట్టు 
ఎక్కడ    : అహ్మదాబాద్, గుజరాత్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags