హక్కుల నేత, పద్మభూషణ్‌ గ్రహీత 'ఇలా భట్‌' అస్తమయం

అహ్మదాబాద్‌: మహిళా హక్కుల ఉద్యమకారిణి, సెల్ఫ్‌ ఎంప్లాయ్‌డ్‌ విమెన్స్‌ అసోసియేషన్‌ (సేవా)  వ్యవస్థాపకురాలు ఇలా భట్‌ (89) నవంబర్ 2న అహ్మదాబాద్‌లో వయో సంబంధ సమస్యలతో కన్నుమూశారు. పద్మభూషణ్‌ గ్రహీత అయిన ఆమె మహిళా సాధికారికత సాధనకు ఎనలేని కృషి చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
SEWA Founder And Padma Bhushan Recipient Ela Bhatt Dies

అసంఘటిత రంగ మహిళా కార్మిక సంఘం సేవాలో ప్రస్తుతం 20 లక్షల మంది సభ్యులున్నారు. ఇలా భట్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1933లో జన్మించారు. కొద్ది కాలం పాటు టీచర్‌గా పనిచేశారు. అనంతరం అహ్మదాబాద్‌ వస్త్ర కార్మిక సంఘం న్యాయ విభాగంలో చేరారు. వస్త్ర రంగంలో పనిచేసే మహిళల కోసం 1972లో సేవాను నెలకొల్పారు. తర్వాత ఇతర రంగాలకూ విస్తరించింది. సేవా ఆధ్వర్యంలో సహకార బ్యాంకు స్థాపన, సూక్ష్మ రుణ ఉద్యమం మొదలయ్యాయి. ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థాపకుల్లో ఈమె ఒకరు. గాంధీ సిద్ధాంతాలను ఆచరించే ఇలా భట్‌ మహాత్ముడు నెలకొల్పిన గుజరాత్‌ విద్యాపీఠ్‌కు చాన్స్‌లర్‌గా ఈ ఏడాది అక్టోబర్‌ వరకు కొనసాగారు. రాజ్యసభ సభ్యురాలిగా, ప్రణాళికా సంఘం సభ్యురాలిగాను ఆమె పనిచేశారు. రామన్‌ మెగసెసె, రైట్‌ లైవ్లీహుడ్, నివానో శాంతి బహుమతి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్నారు. ఆమెకు అమిమాయి, మిహిర్‌ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags