AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా

ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల కమిషన్‌(ఈసీ) నియమించింది.

ఈయ‌న 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు.  మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని గుప్తాను ఈసీ ఆదేశించింది.  

ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని మే 5వ తేదీ ఈసీ బదిలీ చేసింది. తర్వాత ఏపీ చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌) ముగ్గురు సీనియర్‌ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీ‌ష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది.

Lok Sabha Election 2024: ఎండల తీవ్రత నేపథ్యంలో పోలింగ్‌ సమయం పెంపు..

#Tags