Highest Railway Bridge : ఎత్తయిన రైలు వంతెనపై ట్రయల్ రన్ విజయవంతం..
జమ్మూకశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై జూన్ 16న ఒక రైలు ఇంజన్ను నడిపి తొలి ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఇప్పటికే ఉధంపూర్–బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగానే నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1315 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు.
#Tags