Lok Sabha Elections 2024: నాలుగో దశతో ముగిసిన‌ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ.. ఏఏ రాష్ట్రాల్లో అంటే..

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

వీటిలో మొదటి, రెండవ, మూడవ, నాల్గవ దశలకు సంబంధించిన ఓటింగ్ పూర్తయ్యింది. నాలుగో దశతో దేశంలోని సగానికి పైగా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.

దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 26న రెండో దశలో 12 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 7న మూడో దశలో 11 రాష్ట్రాల్లోని మొత్తం 93 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 13న 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తంమీద ఇప్పటి వరకు దేశంలోని 379 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఇంకా ఐదో దశలో 49, ఆరో దశలో 58, ఏడో దశ(చివరి)లో 57 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, డామన్ అండ్‌ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, గోవా, అసోం, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌లో నాలుగో దశతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.

Lok Sabha Elections 2024: పది రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏపీ, తెలంగాణలో బరిలో ఉన్న‌అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..

దేశంలో అతి తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన మొదటి ఈశాన్య రాష్ట్రం  సిక్కిం. ఈ రాష్ట్రంలో ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది అన్‌రిజర్వ్‌డ్. ఏప్రిల్ 19న మొదటి దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. దీని తరువాత తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన రెండవ రాష్ట్రం నాగాలాండ్. ఇక్కడ కూడా ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది కూడా అన్‌రిజర్వ్డ్. తొలి దశలోనే నాగాలాండ్‌లో కూడా ఓటింగ్ జరిగింది. మిజోరంలో ఒక లోక్‌సభ స్థానం కూడా ఉంది. ఇది ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యింది. ఇక్కడ కూడా ఏప్రిల్ 19న ఓటింగ్ ప్రక్రియ జరిగింది.

మొదటి దశలో అత్యధికంగా త్రిపురలో 80 శాతం ఓటింగ్ జరిగింది. బీహార్‌లో అత్యల్పంగా 48 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో త్రిపురలో గరిష్టంగా 78.63 శాతం ఓటింగ్ జరిగింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో అత్యల్పంగా 54 శాతం పోలింగ్ నమోదైంది. మూడో దశలో అసోంలో అత్యధికంగా 81.71 శాతం ఓటింగ్ జరిగింది. యూపీలో అత్యల్పంగా 57.34 శాతం ఓటింగ్ నమోదైంది.

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏప్రిల్ 19న సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. ఒడిశాలోని 147 స్థానాలకు నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి. 

EVM-VVPAT Case: ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

#Tags