India vs China: టగ్ ఆఫ్ వార్‌లో చైనాను ఓడించిన భారత సైనికులు

భారత సైనికులు టగ్ ఆఫ్ వార్‌లో చైనాను ఓడించారు.

సుడాన్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్‌లో భాగంగా నిర్వహించిన 'టగ్ ఆఫ్ వార్' పోటీలో భారత సైనికులు చైనా సైనికులను ఓడించారు. ఈ విషయాన్ని భారత సైన్య అధికారులు వెల్లడించారు.

ఈ పోటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టగ్ ఆఫ్ వార్ లో భారత్, చైనా జట్లు పోటీ పడ్డాయి. భారత జట్టు అద్భుతమైన టీంవర్క్, పట్టుదలతో చైనా జట్టును ఓడించింది. ఈ స్నేహపూర్వక పోటీ అక్కడ ఉన్న మిగిలిన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది. 

 

 

➤ 24 మార్చి 2005న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలతో ఏర్పాటైంది.
➤ సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్‌మెంట్ మధ్య 9 జనవరి 2005న శాంతి ఒప్పందం కుదిరింది.
➤ అప్పటి నుంచి సూడాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

US Satellite: అంతరిక్ష యుద్ధం.. శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా!!

#Tags