Skip to main content

Pakistan: చైనా ఆర్మీ జనరల్‌కు పాక్‌ అత్యున్నత పురస్కారం

పాక్‌-చైనాల దోస్తీ మరింత బలపడుతోంది.
General Li Jiaming of China's PLA receiving Nishan-e-Imtiaz from Pakistan officials  Award ceremony for General Li Jiaming, Nishan-e-Imtiaz presentation by Pakistan  Pakistan Gives Nishan e Imtiaz Military awarded to top Chinese General

తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్‌ను పాక్‌ ఘనంగా సత్కరించింది. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘నిషాన్-ఈ-ఇమ్తియాజ్’ను లీ జియామింగ్‌కు అందజేసింది.

ఇరు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే పాక్‌ లీ జియామింగ్‌కు పాక్‌ ఈ గౌరవం అందజేసింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్‌లు, పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గతంలో ఈ గౌరవాన్ని భారత్‌కు చెందిన దివంగత నటుడు దిలీప్ కుమార్ అందుకున్నారు.

ఈ పురస్కారం జనరల్ లీ జియోమింగ్ నాలుగు దశాబ్దాల కెరీర్‌కు ఇది తగిన గుర్తింపులాంటిది.

Srettha Thavisin: థాయ్‌లాండ్‌ ప్రధాని తొలగింపు.. కార‌ణం ఇదే..

Published date : 28 Aug 2024 01:15PM

Photo Stories