Akshaya Patra Foundation: అక్షయపాత్ర ఫౌండేషన్ 400 కోట్ల భోజనాల మైలురాయి!!

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అక్షయపాత్ర ఫౌండేషన్ 400 కోట్ల భోజనాలను పేద పిల్లలకు అందించిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఘనంగా సత్కారం జరిగింది.

శీర్షిక: ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి సాధనలో భారత్‌ విజయాలు
ప్రధాన అతిథులు: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అధ్యక్షుడు మధు పండిత్‌ దాస

ప్రధాన మంత్రి మోదీ సందేశం: 400 కోట్ల భోజనాల మైలురాయిని అధిగమించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అభినందిస్తూ సందేశం పంపారు.

భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ వ్యాఖ్యలు: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగోదైన ఆకలి నిర్మూలనలో భారత్‌ కృషికి ఇది నిదర్శనమని అన్నారు.

అక్షయపాత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ మధుపండిత్‌ దాస ప్రసంగం:

➢ భారీఎత్తున వంట, ఆహార పంపిణీకి తాము ఉపయోగిస్తున్న అధునాతన పరిజ్ఞానాన్నీ, అనుభవాన్ని ప్రపంచంలోనిఇతర దేశాలు, సంస్థలతో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
➢ తుర్కియే భూకంపంలోనూ, ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ ఆర్తులకు అన్నపానాదులు అందిస్తున్నామని వివరించారు.
➢ భారత్‌లో అక్షయపాత్ర 72 వంటశాలలను నిర్వహిస్తోందని, గత 24 ఏళ్లలో 24,000 పాఠశాలల్లోని 21 లక్షల మందికి రోజూ భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్క‌డే!

#Tags