Mirny Mine: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు..!

భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని.

దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు ఉంటుంది. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్‌ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్‌ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్‌ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్‌ పేరిట గనిని ప్రారంభించింది.

ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. అనంత‌రం కొన్ని రోజుల తర్వాత ఇది మూతబడింది. ఇది రష్యన్‌ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది.

ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండు వేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. 

Lakshadweep History: లక్షద్వీప్‌పై పాకిస్తాన్ కన్ను.. లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైందంటే..

#Tags