Central Government: 28 రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రూ.కోట్లు అంటే..!

దేశవ్యాప్తంగా 28 రాష్ట్ర ప్రభుత్వా­లకు ఇవ్వాల్సిన రూ.1,78,173 ­కోట్ల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ మొత్తంలో 2024 అక్టోబర్‌లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయి­దా రూ.89,086.50 కోట్లు కూడా ఉన్న­ట్లు కేంద్ర ఆర్థిక శాఖ అక్టోబ‌ర్ 10వ తేదీ ఒక ప్రక­టనలో తెలిపింది. 

ఇందులో భాగంగా ఆంధ్ర­ప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు, తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. 

ఈ పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తర్‌­ప్రదేశ్‌కు రూ.31,962 కోట్లు ఉండగా, అత్యల్పంగా గోవాకు రూ.688 కోట్లు ఇచ్చింది. పండుగల సీజన్‌ దృష్ట్యా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడం, అభి­వృద్ధి, సంక్షేమ తదితర వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందస్తు వాయి­దాలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. 

Interest Rates: వరుసగా 10వ సారి.. రెపో రేటు యథాతథంగా కొనసాగింపు..!

#Tags