ఎంఎస్సీ ఎర్త్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశాలుకు దరఖాస్తుల ఆహ్వానం

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కళాశాలలో ఎంఎస్సీ ఎర్త్‌ సైన్స్‌ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ అప్లైడ్‌ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంచాలకులు డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

ఈ కోర్సుల్లో పట్టభద్రులైన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.

ఆసక్తిగల విద్యార్థులు ఆగ‌స్టు 22వ తేదీ నుంచి 24వ తేదీ లోపు ఓఏఎండీసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్‌, ఇతర సందేహాలకు 8985597928 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

UPSC Recruitment 2024: యూపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి

UPSC CMS 2024 Notification: 827 మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలో రాణించే మార్గాలు ఇవే..

#Tags