BITS Pilani: ఆన్‌లైన్‌లో బిట్స్‌ పిలానీ బీఎస్సీ డిగ్రీ

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బిట్స్‌ క్యాంపస్‌ లో ‘కొర్సెరా’భాగస్వామ్యంతో మొట్టమొదటి ఆన్‌లైన్‌ కోర్సు (బీఎస్సీ కంప్యూటర్స్‌) సెప్టెంబర్ 12 న ప్రారంభమైంది.
BITS Pilani Coursera Launch Online BSc in Computer Science

ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరంలేదని క్యాంపస్‌ డైరెక్టర్‌ జి.సుందర్‌ తెలిపారు. 

Also read: Infosys Employees : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్‌​.. ఈ రూల్స్ అతిక్రమిస్తే ఇక‌ అంతే.. !

12వ తరగతి లేదా దానికి సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ డిగ్రీకి ప్రపంచంలో ఏ మూలనుంచైనా పరీక్ష రాయొచ్చన్నారు. బిల్స్‌ పిలానీతో కలిసి ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సును ప్రారంభించడం పట్ల కొర్సెరా చీఫ్‌ కంటెంట్‌ ఆఫీసర్‌ బెట్టీ వాండెన్‌ బోష్‌ హర్షం వ్యక్తం చేశారు. అర్హత గల విద్యార్థులు నేటి నుంచి నవంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం  బిట్స్‌ వెబ్‌సైట్‌లో  సంప్రదించవచ్చు.

Also read: Employees job : ఈ కంపెనీ ఉద్యోగుల గుండెల్లో గుబులే.. అతిపెద్ద కోతలకు తెర..!