మూడు డిగ్రీ కళాశాలలకు ప్రిన్సిపాళ్ల నియామకం

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలో మూడు ప్రభు త్వ డిగ్రీ కళాశాలలకు ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాళ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాలకు డాక్టర్‌ అతిక్‌ బేగం, ఆదిలాబాద్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలకు సంగీత, ఉట్నూర్‌ డిగ్రీ కళాశాలకు టి.ప్రతాప్‌సింగ్‌ను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: Engineering Seats: కారణాల్లేకుండా ఎలా తిరస్కరిస్తారు?: హైకోర్టు

అతిక్‌ బేగం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అమెకు కళాశాల సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

#Tags