Candidates for TET: టెట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య..!

ఇటీవలె నిర్వహించిన టెట్‌ పరీక్షలు బుధవారం ముగిసాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్య గురించి అధికారులు వెల్లడించారు..

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో గత నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్షలు బుధవారం ముగిశాయి. బుధవారం జరిగిన పరీక్షలకు మొత్తం 655 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 365 మందికి 333 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు.

Education for Women: బాలికా విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహం

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 365 మందికి గాను 322 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు.

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ఇదే..

#Tags