Top Scorers of 10th Board Results: ఏపీ పదో తరగతి ఫలితాల్లో కూలీ ఇంట చదువుల తల్లి.. 593 మార్కులతో శభాష్‌ అనిపించుకుంది

Top Scorers of 10th Board Results

ఏపీ పదో తరగతి ఫలితాల్లో కూలీ ఇంటి ఆణిముత్యం మెరిసింది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఓ బాలిక 593 మార్కులు సాధించింది. కర్నూలు నగరంలో ఎం. ఇక్బాల్‌ బాషా, ఆసియా తహసీన్‌ కుమార్తె షేక్‌ హుమెరా ఇక్బాల్‌ నగరంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మున్సిపల్‌ మెమోరియల్‌ హైస్కూల్‌లో చదివింది.

కూలీ ఇంట చదువుల తల్లి
తండ్రి దినసరి కూలీగా పనిచేస్తూ కుమార్తెను చదివించాడు. తండ్రి కష్టాన్ని చూసి చలించిన షేక్‌ హుమెరా ఇక్బాల్‌ ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్లి శ్రద్ధగా చదువుకునేది. సబ్జెక్టుల వారీగా వచ్చే అనుమానాలను ఉపాధ్యాయులను అడిగి ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునేది.

అలా ఎంతో కష్టపడి చదివి 593 మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఇలాగే మరింత మెరుగ్గా చదువుకుంటూ భవిష్యత్తులో డాక్టర్‌ అయి సేవలు అందించడమే తన లక్ష్యమని షేక్‌ హుమెరా ఇక్బాల్‌ తెలిపింది. 

#Tags