AP Panchayat Raj Department jobs: AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టుల భర్తీకి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో త్వరలో 1488 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆమోదం లభిస్తే ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధంగా ఉంది.
డిగ్రీ అర్హతతో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 20వేలు: Click Here
ఈ 1488 పోస్టులు భర్తీ వివరాలు:
రాష్ట్రంలో కరోనా కారణంగా మొత్తం 2917 మంది ఉద్యోగులు మరణించారు. వీరిలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 1944 మంది, కలెక్టరేట్ పరిధిలో 330 మంది , కార్పొరేషన్లు మరియు సొసైటీలకు సంబంధించిన 560 మంది, యూనివర్సిటీలో 83 మంది మరణించడం జరిగింది.
ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాల కోసం 2744 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1488 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు.
ఆదేశాలు జారీ:
ఈ సమస్యను మరణించిన ఉద్యోగుల కుటుంబాలు ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడంతో అయినా అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఉద్యోగాలు భర్తీకి చర్యలు ప్రారంభించిన అధికారులు ఉద్యోగాల భర్తీ ఫైల్ ను ఆర్థిక శాఖకు పంపించారు. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి గారు వద్దకు చేరింది. ముఖ్యమంత్రి ఈ ఫైల్ పై సంతకం చేస్తే త్వరలో 1488 పోస్టులు భర్తీ జరగనుంది.