Girls Gurukul Admissions: బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..

చిత్తూరు: జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపల్ భార్గవి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. 2024–25 విద్యా సంవత్సరంలో తమ పాఠశాలలో 5,6,7,8 తరగతుల్లో మైనారిటీ బాలికలు అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Gurukul Schools: ఈనెల 15వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు..
#Tags