Polytechnic Admissions : పాలిటెక్నిక్ ప్రవేశానికి చివరి దశ నోటిఫికేషన్ విడుదల..
మైదుకూరు: పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు చివరి దశ నోటిఫికేషన్ విడుదలైందని మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.గురుమూర్తి రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంబంధిత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించేందుకు జూలై 11 నుంచి 13వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, కళాశాల ఆప్షన్ల నమోదు ఉంటుందని.. జూలై 16న సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. జూలై 18 నుంచి 20వ తేదీ వరకు కేటాయించిన కళాశాలలో చేరాల్సి ఉంటుందని వివరించారు. మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, మూడేళ్ల డిప్లొమో కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. డిప్లొమో తర్వాత బీటెక్ చేయుటకు ఈసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ కూడా ఇస్తామన్నారు.
TET 2024 Exam : టెట్–2024 షెడ్యూల్లో మార్పులు.. పరీక్షలు వాయిదా.. ఎప్పుడు!