Basara IIIT Counseling 2024: ట్రిపుల్ఐటీలో కొనసాగుతున్న కౌన్సెలింగ్
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపికై న విద్యార్థులకు రెండోరోజు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ గ్రామానికి చెందిన కోలన్ తనూజాకు మొదటి ఎంపికపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ సృజన మాట్లాడుతూ బుధవారం కూడా కౌన్సెలింగ్ కొనసాగుతుందని, 1001 నుంచి 1404 వరకు ఉన్న విద్యార్థులు హాజరుకావాలన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ మహేశ్, జాయింట్ కన్వీనర్ పావని, రంజిత్కుమార్, డా.దత్తు, అడ్మిషన్ కమిటీ సభ్యులు హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
#Tags