Admissions: డిగ్రీ, పీజీ కళాశాలల్లో అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ!
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ కోసం మూడో విడత కౌన్సిలింగ్కు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. 19న ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించారు. 22న మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు.
Mega Job Mela : రేపు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా..
అలాగే మంగళవారం నుంచి ఎస్వీయూ, పద్మావతీ వర్సిటీల్లో రెండో విడత పీజీ సెట్–2024 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలవనుంది. వెటర్నరీ వర్సిటీలో ఈనెల చివరి వారంలో బీవీఎస్సీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
#Tags