Collector Venkatesh Dotre: సెలవుల్లో పనులు పూర్తి చేయాలి
![Work should be completed during holidays](/sites/default/files/images/2024/05/21/venkateshdotre-1716270974.jpg)
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో అశోక్తో కలిసి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024– 25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
చదవండి: 10th class news: 10వ తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్...
జిల్లాలోని 685 ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమై న తాగునీరు, విద్యుత్, బోర్వెల్స్, ఇతర మరమ్మతులు చేపట్టాలన్నారు. బాలికలకు ప్రత్యేక మూ త్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా యూనిఫాంలు అందించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి భరత్, డీఆర్డీవో సురేందర్, ఇంజనీరింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.