Skip to main content

Tenth Students : విజయవాడ రాజ్‌ భవన్‌కు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల ఆహ్వానం..

Tenth class student and sports women were invited to Vijayawada Raj Bhavan

నంద్యాల: స్థానిక ఎస్పీజీ హైస్కూల్‌ పదో తరగతి విద్యార్థిని లహరికి, వెలుగోడు మోడల్‌ స్కూల్‌లో చదివి పదో తరగతిలో 593 మార్కులు సాధించిన కొండా సాయిచరణ్‌కు రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానం అందింది. లహరి కేరళలో జరిగిన హాకీ క్రీడా పోటీల్లో సౌత్‌జోన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పథకం కైవసం చేసుకుంది.

Faculty Jobs: ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. రేపే చివరి తేది

కొండా సాయిచరణ్‌ వెలుగోడు మోడల్‌ స్కూల్‌ చదివి పదో తరగతిలో 600 మార్కులకు గానూ 593 మార్కులు సాధించాడు. దీంతో స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ రాజ్‌ భవన్‌లో గురువారం సాయంత్రం జరిగే ఎట్‌ హోమ్‌ రిసెప్షన్‌లో పాల్గొనేందుకు వారికి ఆహ్వానం అందినట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి, ఎస్పీజీ హైస్కూల్‌ హెచ్‌ఎం జీవలత తెలిపారు. కాగా విద్యార్థులకు పలువురు అభినందనలు తెలిపారు.

SSLV-D3: ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం

Published date : 16 Aug 2024 03:01PM

Photo Stories