Skip to main content

Strictness in Evaluation: ప‌దో త‌ర‌గ‌తి మూల్యాంక‌నం స‌మ‌యంలో టీచ‌ర్లు జాగ్ర‌త్తగా ఉండాల్సిందే.. లేకుంటే..!

పదో తరగతి విద్యార్థి ఒక స‌బ్జెక్టులో ఫెయిల్ అయినట్లు ఫ‌లితాల్లో ప్ర‌క‌టించారు. కాని, అక్క‌డే ఒక త‌ప్పిదం జ‌రిగింది..
parents and teachers discussing evaluation mistakes.  Teachers must be even more alert and pay strict attention during exam papers evaluation

గూడూరు: ఇటీవల నిర్వహించిన పదో తరగతి మూల్యాంకనంలో ఓ తప్పిదం జరిగింది. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పరిమళ లక్ష్మీ బాలాజీ, శశికళ కుమారుడు కుషల్‌ శ్రీనివాస్‌ అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలు రాశాడు. ఆ విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో 90 పైగా మార్కులు రాగా, హిందీలో మాత్రం 17 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో సదరు విద్యార్థి ఫెయిల్‌ అయ్యాడు. తల్లిదండ్రుల సూచన మేరకు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేశాడు.

AP Inter Supplementary Exams: ముగిసిన ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు.. గైర్హాజ‌రైన విద్యార్థుల సంఖ్య‌..!

ఇటీవల రీ వెరిఫికేషన్‌ ఫలితాలు వచ్చాయి. ఇందులో కుషల్‌ శ్రీనివాస్‌కు అదే హిందీ సబ్జెక్టులో 75 మార్కులు వచ్చాయి. మూల్యాంకన సమయంలో అధికారులు, సంబంధిత టీచర్‌ చేసిన తప్పిదం వల్ల కుషల్‌ శ్రీనివాస్‌కు అన్యాయం జరిగింది. ఇలాంటి తప్పుల వల్ల విద్యార్థుల జీవితాలు బలవుతాయని, మూల్యాంకనం చేసేప్పుడు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు.

DEE Results and Counselling 2024: డీఈఈ కోర్సుకు సంబంధించి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌.. అర్హుల‌కు జూన్ 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం..

Published date : 31 May 2024 03:06PM

Photo Stories