Skip to main content

Tribal Students: గిరిజన విద్యార్థుల్లో అపార ప్రతిభ

Talent among tribal students

రంపచోడవరం: గిరిజన విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే అన్నారు. నాసిక్‌లో జరిగిన జాతీయస్థాయి క్రీడల్లో బందపల్లి బాలురు ఆశ్రమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కోసు లోకేష్‌ దొర, సీహెచ్‌ కల్యాణరావుదొర డబల్‌ డచ్‌ స్పీడ్‌లో పతకాలు సాధించారు. వీరు శుక్రవారం పీవోతో పాటు సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ను కలిశారు. ఇద్దరు విద్యార్థులను పీవో, సబ్‌కలెక్టర్‌ అభినందించారు. డీడీ జాన్‌రాజ్‌, ఏటీడబ్ల్యూవో రామ తులసి, హెచ్‌ఎం రాములు, పీడీ తిరుపతిరావు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: 10th Class Exam: టెన్త్‌లో నూరుశాతం మార్కులసాధనే లక్ష్యం

Published date : 07 Oct 2023 03:00PM

Photo Stories