Skip to main content

Students: విద్యార్థుల ప్రగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

Online Progress Recording   Students progress should be recorded online    Education Department Programs

తాడ్వాయి: విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని విద్యాశాఖ తొలిమె ట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల రాష్ట్ర పరిశీలకుడు శ్రీనివాసచారి సూచించారు. బుధవారం ఆయన తాడ్వాయి మండలంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. అనంతరం కృష్ణాజీవాడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కాంప్లెక్స్‌ సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీచింగ్‌ డైరీలను నిర్వహించాలన్నారు. ప్రతి తరగతికి లైబ్రరీ పీరియడ్‌ కేటాయించాలని సూచించారు. పేరెంట్స్‌ మీటింగ్‌లకు తల్లిదండ్రులు హాజరయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఆయన వెంట డీఈవో రాజు, పర్యవేక్షకులు వేణుగోపాల్‌, లక్ష్మీనారాయణ, ఎంఈవో రామస్వామి, పాఠశాల హెచ్‌ఎం నివేదిత పాల్గొన్నారు.

☛ Govt Schools: బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి

Published date : 08 Dec 2023 10:15AM

Photo Stories