Essay Writing Competition: రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో విద్యార్థినికి గోల్డ్ మెడల్
![Madugula Mandal Achiever: Pamu Hemalatha's Victory in Essay Contest, Gadirai Student Wins State Level Essay Competition Gold Medal, state level essay writing competition winners in ap, Pamu Hemalatha - Gold Medalist in Acharya Devobhava Essay Competition](/sites/default/files/images/2023/11/22/essay-writing-competition-1700644529.jpg)
మాడుగుల: ఇటీవల పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో ‘ఆచార్య దేవోభవ’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో మాడుగుల మండలం గాదిరాయికి చెందిన విద్యార్థిని పాము హేమలత గోల్డ్ మెడల్ సాధించింది. ఈమె గాదిరాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ పోటీలో రాష్ట్రంలోని 7,225 హైస్కూళ్లతోపాటు కళాశాలలకు చెందిన 3,60580 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు, 33 మంది విద్యార్థినులు గోల్డ్ మెడల్కు ఎంపికయ్యారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గోల్డ్ మెడల్ను హేమలత అందుకుందని సత్యసాయి సేవా సంఘం సభ్యులు పుట్టా బలరామ్, కె.శ్రీనివాసరావు, కె. రాజుకొండలు తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సత్యపాయి సేవా సంఘం మండల సభ్యులు అభినందించారు.
చదవండి: Fencing Competition: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు కొత్తగూడ విద్యార్థి