Skip to main content

Screening Test: గురుకుల సీఓఈలో ప్రవేశాలకు స్క్రీనింగ్‌ పరీక్ష

Screening test for admission to Gurukula COE

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: టీఎంఆర్‌జేసీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి కళాశాలలో వివిధ విభాగాలైన నీట్‌, జేఈఈ/ ఐఐటీ, సీఏ/ సీఎస్‌, ఎన్‌డీఏ, సీఎల్‌ఏటీలలో ప్రవేశాల కోసం ఆదివారం జిల్లాకేంద్రంలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించినట్లు మైనార్టీ గురుకులాల ఆర్‌ఎల్‌సీ ఖాజా బావుద్దీన్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని టీఎంఆర్‌జేసీ బాలుర–1, 2, 3 కళాశాలల్లో 1,050 మందికి 761 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. పరీక్షను ఆర్‌ఎల్‌సీ, విజిలెన్స్‌ అధికారి జమీర్‌ పర్యవేక్షించారు.

439 మంది హాజరు..
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన రెండోదశ అర్హత పరీక్షకు 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జూని యర్‌ కళాశాల, రాంరెడ్డిగూడెంలో ఈ పరీక్షలు నిర్వహించగా బాలురు 193 మంది, బాలికలు 269 మంది హాజరైనట్లు కళాశాల అధ్యాపకులు వాణిశ్రీ తెలిపారు.
 

Published date : 26 Feb 2024 06:58PM

Photo Stories