ITDA PO: విద్యతోనే బంగారు భవిష్యత్తు
Sakshi Education
డుంబ్రిగుడ: బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ సూచించారు.
![Government school renovation inaugurated by Paderu ITDA PO Abhishek. Education is the golden future "Paderu ITDA PO Abhishek advocates school attendance for all children.](/sites/default/files/images/2024/05/24/students37mr0-1716537628.jpg)
మండలంలోని కండ్రుం పంచాయతీ సర్రాయి గ్రామంలో రూ.3లక్షలతో ఆధునికీకరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం పీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. పాఠశాలలకు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, బొమ్మలు వే యించాలని ఆయన ఆదేశించారు. ఈఈ వేణుగోపాల్, ఏఈ అభిషేక్, సర్పంచ్ హరి, వైస్ ఎంపీపీ ఆనందరావు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Published date : 26 Jan 2024 06:00PM