Skip to main content

BED College: బీఈడీ కళాశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

Computer Lab started in BED College

ఉట్నూర్‌రూరల్‌: ఐటీడీఏ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేబీ ప్రాంగణంలోని బీఈడీ కళాశాలలో నూతన కంప్యూటర్‌ ల్యాబ్‌ను శుక్రవారం ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌ పా య్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న లైబ్రరీలను పరిశీలించారు. పీవో రాకతో కళాశాల ప్రిన్సిపాల్‌ మెస్రం మనోహర్‌, అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులు స్వాగ తం పలికారు. అనంతరం పీవోను సన్మానించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ప్రొపెషనల్‌ కోర్సులో రాణించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశ పరీక్షలతో డిగ్రీలోని మార్కుల ఆధారంగా గిరిజన విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. ఛాత్రోపాధ్యాయులకు అవసరమయ్యే కంప్యూటర్‌ ల్యాబ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఐటీడీఏ పీవో చాంబర్‌లో అంగవైకల్యం గల విద్యార్థులు హైదరాబాద్‌లోని స్వీకారామ్‌ కళాశాలలో చదువుకోవడానికి ఫీజుకు సంబంధించిన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్‌, ఏవో రాంబాబు, విద్యార్థులు చిన్న, సందీప్‌, శ్రీకాంత్‌, బీఈడీ కళాశాల అధ్యాపకులు ఉన్నారు.

JNTU: జేఎన్టీయూలో సీటు సాధించిన సీవోఈ విద్యార్థులు

Published date : 22 Jul 2023 01:34PM

Photo Stories