Skip to main content

JNTU: జేఎన్టీయూలో సీటు సాధించిన సీవోఈ విద్యార్థులు

COE students

బెల్లంపల్లి: పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల సీవోఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ) విద్యార్థులు జేఎన్టీయూలో సీటు సాధించి సత్తా చాటారు. కళాశాలకు చెందిన అలకటి గణేశ్‌ (మెకానికల్‌ ఇంజనీర్‌), బూక్య అరవింద్‌ (బయోటెక్నాలజీ), ఎనగందుల మౌర్య (కంప్యూటర్‌ సైన్స్‌), తాళ్ల పవన్‌కళ్యాణ్‌ (సివిల్‌ ఇంజనీరింగ్‌) విద్యార్థులు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో సీటు సాధించి సీవోఈ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కళాశాల ప్రి న్సిపాల్‌ ఐనాల సైదులు పేర్కొన్నారు. వీరితో పా టు మరో 18 మంది విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీటు సాధించినట్లు తెలి పారు. సదరు విద్యార్థులను ఎమ్మెల్యే చిన్నయ్య అభినందించారు. పట్టుదలతో చదివి జేఎన్టీయూలో సీటు సాధించడం హర్షనీయమన్నారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కోట రాజ్‌కుమార్‌, అధ్యాపకులు లక్ష్మీనారాయణ, రవి, శ్రీరామవర్మ, ఎం.రమేశ్‌, ఎస్‌.రమేశ్‌, రాజేశ్‌, నరేష్‌ హర్షం వ్యక్తం చేశారు.
 

Published date : 21 Jul 2023 07:00PM

Photo Stories