Skip to main content

Andhra Pradesh: జిల్లా స్థాయిలో పుర‌స్కారాలు... ఎవ‌రికి?

శుక్రవారం ఒక ప్రకటనలో అన్నమయ్యజిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం పురుషోత్తం మాట్లాడుతూ, ఉపాధ్యాయుల‌కు పుర‌స్కారాలు అందించేందుకు ఈనెల 30 లోగా ద‌రిఖాస్తులు పూర్తి చేసుకోవాల‌ని పేర్కొంటూ, ద‌రిఖాస్తు చేసుకునే విధానం తెలిపారు..
applications for teacher awards
applications for teacher awards

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా స్థాయి ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అన్నమయ్యజిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం పురుషోత్తం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోని ప్రభుత్వ /జిల్లా పరిషత్‌/ ఎయిడెడ్‌ /పురపాలక యాజమాన్యం/ఏపీఆర్‌ఈజె/ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఎస్‌/ ఏపీ మోడల్‌/కెజీబీవి/ ఇతర యాజమాన్య ( ప్రైవేట్‌ విద్యాసంస్థలు తప్ప) ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.కనీసం 10 సంవత్సరాలు బోధన అనుభవం కలిగిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 30 వరకు గడువు ఉందని చెప్పారు

ఆ ఊరిలో ఇంటికో డాక్టర్‌ ఎందుకున్నారు? ఇందుకు ఎవరు ప్రేరణగా నిలిచారు?

Published date : 26 Aug 2023 03:32PM

Photo Stories