Skip to main content

Pre PhD Exams: ప్రీ పీహెచ్‌డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి

Apply for Pre PhD Exams

వెంకటాచలం: వీఎస్‌యూలో వచ్చే నెల్లో నిర్వహించనున్న ప్రీ – పీహెచ్‌డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి ప్రభాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌టీ, పీటీ), ఏపీఆర్‌సెట్‌ – 2020, 21 సంవత్సరాల్లో అడ్మిటైన అనుబంధ రీసెర్చి స్కాలర్స్‌ మాత్రమే అర్హులని తెలిపారు. ఈ నెల 21 వరకు సాధారణ ఫీజుతో, 22 నుంచి 30 వరకు అపరాధ రుసుముతో చెల్లించొచ్చని చెప్పారు. పరీక్ష రుసుము రెండు పేపర్లకు రూ.2500, ఒక పేపర్‌కు రూ.1500, ఆలస్యంగా సమర్పించినందుకు రూ.250 అపరాధ రుసుముతో చెల్లించాలని సూచించారు. వీఎస్‌యూ, కాకుటూరు, ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చెల్లించిన చలానాతో పాటు పూరించిన దరఖాస్తులను వీఎస్‌యూ కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాలని కోరారు.

చ‌ద‌వండి: AP Govt: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలపై ఫోకస్‌

Published date : 02 Nov 2023 01:14PM

Photo Stories