Skip to main content

‘ESCI’లో పీజీ డిప్లమో కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

రాయదుర్గం: ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్కీ)లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లమో ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ పేరిట నిర్వ హించే కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నట్లు ఎస్కీ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రామేశ్వరరావు మే 30న‌ తెలిపారు.
Applications are invited for PG Diploma Course in ESCI   Application Form for Post Graduate Diploma in Cyber Security Course

2024–25 విద్యాసంవత్సరానికి ఏడాది కాలపరిమితితో కూడిన ఈ కోర్సుకు దరఖాస్తులను కోరుతున్నామన్నారు. గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి 50% మార్కులు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రాడ్యుయేషన్‌ ఫైనల్‌ ఇయర్‌ వార్షిక పరీక్షలు రాసేవారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు.

చదవండి: ‘ESCI’ సందర్శనకు రాష్ట్రపతి అంగీకారం

జూన్‌ 1నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, దరఖాస్తులను సమ ర్పించడానికి జూన్‌ 30 చివరి తేదీగా నిర్ణయించామని తెలిపారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, కోర్సు లో 6 సబ్జెక్టులు ఉంటాయని చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నెంబర్‌ 8886661060, 8143997446లో సంప్రదించాలని సూచించారు.
 

Published date : 31 May 2024 02:55PM

Photo Stories