‘ESCI’లో పీజీ డిప్లమో కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
రాయదుర్గం: ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ సైబర్ సెక్యూరిటీ పేరిట నిర్వ హించే కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నట్లు ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు మే 30న తెలిపారు.
![Applications are invited for PG Diploma Course in ESCI Application Form for Post Graduate Diploma in Cyber Security Course](/sites/default/files/images/2024/05/31/esci-1717147538.jpg)
2024–25 విద్యాసంవత్సరానికి ఏడాది కాలపరిమితితో కూడిన ఈ కోర్సుకు దరఖాస్తులను కోరుతున్నామన్నారు. గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి 50% మార్కులు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ వార్షిక పరీక్షలు రాసేవారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు.
చదవండి: ‘ESCI’ సందర్శనకు రాష్ట్రపతి అంగీకారం
జూన్ 1నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, దరఖాస్తులను సమ ర్పించడానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించామని తెలిపారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, కోర్సు లో 6 సబ్జెక్టులు ఉంటాయని చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 8886661060, 8143997446లో సంప్రదించాలని సూచించారు.
Published date : 31 May 2024 02:55PM