Skip to main content

TSPSC Group IV Exam: గ్రూప్‌–4 అభ్యర్థులకు ప్రత్యేక బస్సులు

ఖమ్మం మామిళ్లగూడెం/సత్తుపల్లి టౌన్‌: టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యాన జూలై 1న‌ జరగనున్న గ్రూప్‌–4 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఖమ్మం, సత్తుపల్లి డిపో మేనేజర్లు శ్రీనివాస్‌, యు.రాజ్యలక్ష్మి తెలిపారు.
 TSPSC Group IV Exam
గ్రూప్‌–4 అభ్యర్థులకు ప్రత్యేక బస్సులు

ఖమ్మం డిపో ద్వారా వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి మమత కళాశాల, వరంగల్‌ క్రాస్‌ రోడ్డు నుండి శ్రీశ్రీ సర్కిల్‌, సిటీ బస్టాండ్‌ నుండి కొత్త బస్టాండ్‌ వయా ఎన్‌ఎస్టీ రోడ్డు వరకు, సిటీ బస్టాండ్‌ నుండి తనికెళ్ల, దానవాయిగూడెం, మల్లెమడుగుకు బస్సులు నడుపుతామని తెలిపారు. అలాగే, సత్తుపల్లి నుంచి ఖమ్మంకు, ఖమ్మం నుంచి సత్తుపల్లికి ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. ఇవేకాక అన్ని రూట్లలో తిరిగే షెడ్యుల్‌ బస్సులను కూడా చేయి ఎత్తిన చోట ఆపి కోరిన చోట దించుతారని తెలిపారు. కాగా, అభ్యర్థులకు సమాచారం ఇచ్చేందుకు బస్టాండ్లలో హెల్ప్‌ లైన్‌ సెంటర్లు కూడా ఏర్పాటుచేస్తున్నామని డీఎంలు వెల్లడించారు.

చదవండి:

TSPSC Group IV Exam: 2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు.. టీఎస్‌పీఎస్సీ సూచనలు ఇవే

Engineering: కౌన్సెలింగ్‌లో తగ్గిన సీట్లు.. ఆ సీట్లు ఏమైనట్టు?

NCERT: 8వ తరగతి సిలబస్‌ తగ్గింపు.. తొలగించిన‌ చాప్టర్లు ఇవే

Published date : 30 Jun 2023 05:23PM

Photo Stories