సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో వివిధ అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది.
మరో పరీక్ష వాయిదా..
రాష్ట్ర ఉద్యానవన శాఖ పరిధిలోని హార్టికల్చర్ ఆఫీసర్(హెచ్ఓ) పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఏప్రిల్ 4న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. తాజాగా జూన్ 17న పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి మార్చి 28న ఒక ప్రకటనలో తెలిపారు. అతి త్వరలో మరిన్ని పరీక్షల తేదీలపై కమిషన్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.