Skip to main content

Group 1 Mains Selection Listలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌కు అర్హుల జాబితా రూపకల్పనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS leader RS. Praveen Kumar addressing media on SC, ST, BC candidates  issues  RS. Praveen Kumar criticizing Group-1 Mains candidate selection process  group 1 mains selection list is grossly unfair to students from backward classes

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికలో జీఓ 29 ప్రకారం చేయడంతో ఈ నష్టం జరిగినట్టు వివరించారు. జీఓ 29 ప్రకారం మల్టీజోన్‌ పరిధిలోని పోస్టుల ఆధారంగా ఆ సంఖ్యకు 50 రెట్లు అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఓపెన్‌ కాంపిటేషన్‌ కేటగిరీలోకి రిజర్వేషన్‌ ఉన్న అభర్థులు అర్హత సాధించలేకపోయారన్నారు.

చదవండి: TGPSC Groups - 2024 Study Material, Bitbank, Model & Previous Papers ...

ఈ అంశంపై టీజీపీఎస్సీని సంప్రదిస్తే సుప్రీంకోర్టు తీర్పును చూపిస్తున్నారని, కానీ సుప్రీంకోర్టు తీర్పుకు ప్రస్తుత పరిస్థితికి ఏమాత్రం పొంతన లేనప్పటికీ సంబంధం లేని అంశాలతో అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఈ ప్రతులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీజీపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌కు సైతం పంపారు.

Published date : 01 Aug 2024 12:31PM

Photo Stories