Skip to main content

Rathore Sindhu & Ankita: ప్రతిభను కనబరిచి.. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో గెలిచి..

ఆదిలాబాద్‌: పోలీసు కానిస్టేబుల్‌ ఫలితాలు ప్రభుత్వం అక్టోబ‌ర్ 4న‌ రాత్రి విడుదల చేసింది. జిల్లాకు చెందిన 330 మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికయ్యారు. ఇది వరకే దేహదారుఢ్య పరీక్షలు, ప్రిలిమినరీలో అర్హత సాధించి తుది పరీక్ష రాశారు. ఫలితాలను ప్రభుత్వం అక్టోబ‌ర్ 4న‌ విడుదల చేసింది. సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 149 మంది, ఏఆర్‌కు 84 మంది, తెలంగాణ స్పెషల్‌ పోలీసు (టీఎస్‌ఎస్‌పీ)కి 97 మంది అర్హత సాధించి ఉద్యోగాలు పొందారు.
Rathore Sindhu & Ankita
ప్రతిభను కనబరిచి.. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో గెలిచి..

కుటుంబీకులు, బంధువులు వారిని అభింనందించారు. అలాగే ఆదిలాబాద్‌ పట్టణంలోని డీఈవో కార్యాలయంలో సబార్డినెట్‌గా పనిచేస్తున్న రాథోడ్‌ కవిత కూతురు రాథోడ్‌ సింధు సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. సింధు తండ్రి శివాజీ పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందాడు.

తండ్రి ఆశయాన్ని ఆమె కొనసాగిస్తోంది. అలాగే భీంపూర్‌ మండలంలోని కరంజి(టి) గ్రామానికి చెందిన అంకిత కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైంది. వీరిని వారి వారి గ్రామస్తులు అభినందించారు.

చదవండి: Dream Successful: యువ‌కుడి గెలుపుతో ఊరంతా సంబరం

ఎంపికైన యువకులు..

కానిస్టేబుల్‌ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాంసి గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్‌రెడ్డి, బట్టు రాహుల్‌ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భీంపూర్‌, కరంజి(టి) గ్రామానికి చెందిన రవి ఏఆర్‌ కానిస్టేబుల్‌కి ఎంపిక కాగా, ఉద్యోగాలు సాధించిన యువకులను గ్రామస్తులు అభినందించారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పలువురి ఎంపిక..

కానిస్టేబుల్‌ ఫలితాల్లో మండలంలోని బాలాపూర్‌కు చెందిన వై. ప్రశాంత్‌, జి.బబ్లు, జి.వంశీ, మాకోడ గ్రామానికి చెందిన బి.అఖిల్‌, బెల్లూరికి చెందిన దశరథ్‌, ప్రణయ్‌, కూర గ్రామానికి చెందిన అఖిల్‌రెడ్డి ఎంపికయ్యారు.
 

Published date : 05 Oct 2023 03:31PM

Photo Stories