Skip to main content

Promotions: త్వరలో 3,200 మంది పోలీస్‌లకి పదోన్నతులు

హైకోర్టు ఆదేశాల ప్రకారం 3,200 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించేందుకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారని రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు.
police
త్వరలో 3,200 మంది పోలీస్‌లకి పదోన్నతులు

అలాగే ఈ అంశంపై పోలీస్‌ శాఖ సిబ్బంది విభాగం అదనపు డీజీపీ శివధర్‌రెడ్డిని సైతం కలిశామని, పదోన్నతులతోపాటు నోషనల్‌ సీనియారిటీ సమస్యను సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని జనవరి 27న గోపిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న టీఏ మంజూరు చేయించినందుకు డీజీపీకి పోలీస్‌ సిబ్బంది తరుఫున కృతజ్ఞతలు తెలిపామని, అదే విధంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్‌ లీవుల వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించాలని కోరామన్నారు.

చదవండి: 

పదితోనే 2788 కానిస్టేబుల్‌ కొలువు.. ఎంపిక ప్రక్రియ ఇలా..

IPS: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. బదిలీల వివరాలివీ..

న‌న్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..

Published date : 28 Jan 2022 05:23PM

Photo Stories