Intermediate Exams 2024: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం
Sakshi Education
![ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం](/sites/default/files/images/2024/03/06/ts-inter-board-exams-2024-1709719924.jpg)
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) సోమవారం ప్రారంభమైంది. ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్యాంప్ ఏర్పాటుచేయగా, తొలిరోజు సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుపెట్టారు. ఈమేరకు 32మంది అధ్యాపకుల్లో 24 మంది హాజరు కాగా ఒక్కొక్కరు రోజుకు 30పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఈసందర్భంగా క్యాంప్ను డీఐఈఓ కె.రవిబాబు పరిశీలించి అధ్యాపకులకు సూచనలు చేశారు.
Published date : 05 Mar 2024 05:19PM