సాక్షి, హైదరాబాద్: 2023 మార్చిలో జరగనున్న టెన్త్, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 24వ తేదీలోగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని తెలంగాణ ఎస్సెస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
టెన్త్ పరీక్ష ఫీజు గడువు తేదీ ఇదే..
రూ.50 జరిమానాతో డిసెంబర్ 5 వరకూ, రూ.200తో డిసెంబర్ 15 వరకూ, రూ.500తో డిసెంబర్ 29 వరకూ పరీక్ష ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించినట్టు తెలిపారు. విద్యార్థుల నుంచి సేకరించిన ఫీజు మొత్తాన్ని హెచ్ఎంలు సబ్ ట్రెజరీకి చెల్లించే తేదీలను ఖరారు చేసింది.