Skip to main content

Half day schools: నేటి నుంచి ఒంటిపూట బడులు

Telangana: Half day schools from March 15
Telangana: Half day schools from March 15

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే వరకూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు అందజేయాలని స్పష్టం చేసింది. టెన్త్‌ పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు కొనసాగుతాయని తెలిపింది.

 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 15 Mar 2022 03:49PM

Photo Stories