కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు పుస్తక ప ఠనం ఎంతో అవసరమని సెరి ప్రాజెక్టు జిల్లా ఇన్చార్జి జెన్నిఫర్ అన్నారు.
విద్యార్థులకు పుస్తక పఠనం అవసరం
కెరమెరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, జైనూర్ మండలం వడ్డెరగూడ ప్రాథమిక పాఠశాలను అక్టోబర్ 31న సందర్శించారు. ఈ సందర్భంగా రూం టూ రీడ్ కార్యక్రమాన్ని పరిశీలించా రు. విద్యార్థులతో గ్రంథాలయ పుస్తకాలను వారంలో కనీసం మూడు రోజులపాటు చదివించాలని సూచించారు. కనీస సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేయాలన్నారు.
స్టోరీ బుక్స్, ఫ్లాష్ కార్డులు వినియోగించడం ద్వారా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్, పీఎస్ హెచ్ఎం భాస్కర్, సిరి ప్రాజెక్టు బ్లాక్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.