Skip to main content

DEO Durgaprasad: విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌) : చదువులో వెనకబడిన విద్యార్థులపై హెచ్‌ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో దుర్గాప్రసాద్‌ సూచించారు.
Special attention should be given to students

న‌వంబ‌ర్ 15న‌ నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్నతి, తొలిమెట్టు, లక్ష్య కార్యక్రమాలపై హెచ్‌ఎంలకు ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

చదువులో వెనకబడిన విద్యార్థులపై అశ్రద్ధ వహించొద్దన్నారు. పదోతరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచాలని, అందుకు హెచ్‌ఎంలు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో బోర్గాం(పి) హెచ్‌ఎం శంకర్‌ పాల్గొన్నారు.

Published date : 16 Nov 2023 02:15PM

Photo Stories