Telangana: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
Sakshi Education
చేవెళ్ల/మొయినాబాద్: ఉపాధ్యాయుల సమస్యల ను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎస్టీఎఫ్ నా యకులు విన్నవించారు.
![Solve teacher problems](/sites/default/files/images/2024/01/17/angawadi-teacher-1705492442.jpg)
జనవరి 16న వారు సెక్రెటేరియట్లో భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు.
చదవండి: Teachers in School: ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు..!
ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య, ప్రధాన కార్యదర్శి డి.సైదులు, జిల్లా అధ్యక్షుడు జనార్ధనాచారి, ప్రధాన కార్యదర్శి గోపాల్, చేవెళ్ల మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శులు రాంచంద్రయ్య, రమేశ్, సుధాకర్, శ్రీనివాస్, సంతోశ్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 17 Jan 2024 05:24PM