Skip to main content

Devireddy Sudheer Reddy: ఉపాధ్యాయుల పాత్ర గొప్పది

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపైనే ఉందని మూసీ రివర్‌ బోర్డు చైర్మన్‌, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
Devireddy Sudheer Reddy
ఉపాధ్యాయుల పాత్ర గొప్పది

 జిల్లా గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో కర్మన్‌ఘాట్‌లోని వంగా శంకరమ్మ గార్డెన్స్‌లో సెప్టెంబ‌ర్ 24న‌ జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవానికి ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏవీఎన్‌ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

చదవండి: Government Teacher Transfers : ప్రభుత్వ టీచ‌ర్ల బదిలీల్లో అక్రమాలు.. విద్యాశాఖ ఇచ్చిన క్లారిటీ ఇదే..

అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో విద్యా వ్యవస్థ పాత్ర ఎంతో గొప్పదని, బడ్జెట్‌ పాఠశాలల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్‌ పాఠశాలలకు ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లుల్లో రాయితీ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డి, కార్యదర్శి ఎస్‌.ఎన్‌.రెడ్డి, జిల్లా కార్యదర్శి భరత్‌కుమార్‌, కోశాధికారి మీనేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Anganwadis posts: అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 25 Sep 2023 04:01PM

Photo Stories