మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు ఉన్నత చదువులు చదివితేనే ప్రతీ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తామని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రామకృష్ణ అన్నారు.
విద్యార్థులకు ఉపాధి నమోదు పత్రాలు అందజేస్తున్న అధికారి రామకృష్ణ
జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ను అక్టోబర్ 4న ఆయన సందర్శించి మాట్లాడారు. నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి ప్రతీ ఏటా శిక్షణ ఇచ్చి, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు బాగా చదవి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఇంటర్ చదువుతున్న 33 మంది విద్యార్థులకు ఉపాధి నమోదు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి.అమరావతి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు సతీష్, రమేష్, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: