తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫిబ్రవరి 4 నుంచి డిజిటల్ పాఠాలు ప్రసారం చేయనున్నట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు.
డిజిటల్ తరగతులు ప్రారంభం
ఈ మేరకు ఫిబ్రవరి 3న క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. టీ–శాట్ (విద్య, నిపుణ చానల్స్) ద్వారా ఫిబ్రవరి 8 వరకూ పాఠాలు కొనసాగుతాయని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గింది. దీనికి తోడు హైకోర్టు ఈ ఫిబ్రవరి 28 వరకూ ఆన్ లైన్ తరగతులను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నారు.