Skip to main content

School Fees: ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యా­ర్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారద­ర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూ­చించింది.
School Fees
ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి

ఇందుకు సంబంధించి సెప్టెంబ‌ర్ 1న‌ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్‌ వెబ్‌సైట్‌లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్య­దర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ ఫీజుల వివ­రాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొ­న్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయా­లని, ఇందులో విద్యా సంస్థ ని­ర్వాహకుడు లేదా కరస్పాండెంట్‌ అధ్యక్షు­డుగా ఉండా­లని సూచించారు. స్కూల్‌ ప్రిన్సి­పల్, ఉపా­ధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్‌ ఆ క­మి­టీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు.

చదవండి: Jagananna Vidya Deevena Scheme: జగనన్న విద్యా దీవెన ఈకేవైసీపై దృష్టి పెట్టండి

ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి

ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడా­దిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్‌ విద్యార్థులు, పాఠ­శాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్‌ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూ­లు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొ­న్నారు.

మొత్తం ఫీజులో యాజమాన్య ఆదా­యం 5 శాతం, స్కూల్‌ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతా­లకు 50 శాతం, పాఠశాల ఉద్యో­గుల గ్రా­ట్యుటీ, పీఎఫ్, గ్రూప్‌ ఇన్సూ­రెన్స్‌ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివ­రాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్‌ చేత ఆడిట్‌ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.  

చదవండి: Telangana: విద్యార్థుల‌కు ఐపీఎస్ అధికారిణి సూచ‌న‌లు

Published date : 02 Sep 2023 04:55PM

Photo Stories