Skip to main content

Bright Future Education: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

రెంజల్‌: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఒడిశాలోని భువనేశ్వర్‌ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ ఇల్తెపు శేషు అన్నారు.
Bright future with education

 మండలంలోని నీలా హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు మోటివేషనల్‌ స్పీచ్‌ కార్యక్రమాన్ని మార్చి 1న‌ నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల హెచ్‌ఎం శంకర్‌ కుమారుడు శేషు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ఆ దిశగా పయనించాలన్నారు.

చదవండి: Real Life Inspire Success Story : నైట్ వాచ్‌మన్‌గా ప‌నిచేస్తూనే.. ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించానిలా.. కానీ..

విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం శంకర్‌ మాట్లాడుతూ.. తన కుమారుడైన శేషు భువనేశ్వర్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నాడని సెలవులో వచ్చిన సందర్భంగా విద్యార్థులకు చదువుపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం శేషును ఉపాధ్యాయులు, సిబ్బందిన ఘనంగా సన్మానించారు.

Published date : 02 Mar 2024 12:36PM

Photo Stories