DEO Govindarajulu: ఎస్ఏ–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
![DEO Govindarajulu](/sites/default/files/images/2023/11/17/exam-students-16757731553-1700197900.jpg)
జిల్లాలోని 1,148 ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాల పాఠశాలల్లోని 1,07,554 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలు గురువారం ప్రారంభమై 11 వరకు జరుగుతాయని చెప్పారు. 1– 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, 6, 7 తరగతులకు ఉదయం 10 నుంచి 12.45 గంటల వరకు, 9, 10 విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
హెచ్ఎంలు సంబంధిత ఎమ్మార్సీల నుంచి బుధవారం ప్రశ్నపత్రాలు తీసుకెళ్లాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.